31, డిసెంబర్ 2024, మంగళవారం

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో - Ravi Varmake Andani Song Lyrics in Telugu and Vedio - ANR - Ravanude Ramudaite

 

చిత్రం : రావణుడే రాముడైతే 

సాహిత్యం : వేటూరి 

గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, పి సుశీల 

సంగీతం : జి కె వెంకటేష్ 





ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...


రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

ఆ..ఆ... ఆ

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..

ఆ .. ఆ.. ఆ..

రవి చూడని పాడని నవ్యనాదానివో...

రవివర్మకే...

ఆ .. ఆ..

అందని...

ఆ .. ఆ..

ఒకే ఒక అందానివో...

 

 

ఏ రాగమో..తీగదాటి ఒంటిగా నిలిచే

ఏ యోగమో..నన్ను దాటి జంటగా పిలిచే

ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....

ఆ.. ఆ... ఆ..

ఆ... ఆ.. ఆ

ఆ..నీ పాటలే పాడనీ..!

రవివర్మకే...

ఆ .. ఆ.. ఆ..

అందని...

ఆ .. ఆ.. ఆ..

ఒకే ఒక అందానివో...!

 

 

ఏ గగనమో కురులు జారి..నీలిమై పోయే

ఏ ఉదయమో నుదుట చేరి..కుంకుమై పోయే

ఆ కావ్య కల్పనలే..నీ దివ్య శిల్పాలై...

ఆ .. ఆ.. ఆ..

ఆ... ఆ.. ఆ...

ఆ..కదలాడనీ.. పాడనీ..!

 

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో...

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో...

ఆ .. ఆ.. ఆ....

రవి చూడని పాడని నవ్యనాదానివో...

రవివర్మకే..

ఆ.. ఆ...

అందని..

ఆ.. ఆ...

ఒకే ఒక అందానివో...

ఉహు..

 


ఓ బంగరు రంగుల చిలకా పలకవే - O Bangaru Rangula Chilaka Lyrics in Telugu and Vedio - Thotaramudu

 చిత్రం : తోటరాముడు ( 1975 )

గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, పి సుశీల 

సాహిత్యం : వేటూరి 

సంగీతం : చక్రవర్తి 



ఓ బంగరు రంగుల చిలకా పలకవే...

 ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ....

 నా మీద ప్రేమే ఉందనీ..

 నా పైన అలకే లేదనీ..

 

 ఓ అల్లరి చూపుల రాజా పలకవా....

 ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....

 నా మీద ప్రేమే ఉందనీ..

నా పైన అలకే లేదనీ..

 

 

ఓఓఓ ...హోహో హోహో ..

 ఆ ఆ.. ఆ ఆ... ఆ ఆ...

 

 

 

పంజరాన్ని దాటుకునీ..

బంధనాలు తెంచుకునీ..

నీకోసం వచ్చా ఆశతో...!

 

మేడలోని చిలకమ్మా..

మిద్దెలోనిబుల్లెమ్మా..

నిరుపేదను వలచావెందుకే..!

 

నీచేరువలో..నీచేతులలో...

పులకించేటందుకే...!

 

 

ఓ బంగరు రంగుల చిలకా పలకవే...

 ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ....

 నా మీద ప్రేమే ఉందనీ..

నా పైన అలకే లేదనీ..

 

 

సన్నజాజి తీగుంది..

తీగ మీద పువ్వుంది..

పువ్వులోని నవ్వే నాదిలే...!

 

కొంటె తుమ్మెదొచ్చింది...

జుంటితేనెకోరింది...

అందించే భాగ్యం నాదిలే....!

 

ఈ కొండల్లో..

ఈ కోనల్లో..

మనకెదురే లేదులే..!

 

 

ఓ అల్లరి చూపుల రాజా పలకవా....

ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ..

 

నా మీద ప్రేమే ఉందనీ.....!

 నా పైన అలకే లేదనీ....!




27, డిసెంబర్ 2024, శుక్రవారం

నాగార్జున, రాంగోపాల్ వర్మల తొలి కలయికలో బాక్సాఫీసు " శివ " తాండవం..! Nagarjuna + Ramgopal Varma Shiva Movie Trend Setter to Indian Cinema

 

Nagarjuna  Shiva Movie


విడుదల : 5 అక్టోబర్  1989

నటవర్గం : నాగార్జున, అమల, రఘువరన్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, జెడి చక్రవర్తి, చిన్న, ఉత్తేజ్ ...

కథ, కథనం, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ 

నిర్మాతలు : అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర

సంగీతం : ఇళయరాజా 

ఛాయాగ్రహణం : ఎస్ గోపాల్ రెడ్డి

నిర్మాణ సంస్థ : అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ 


" శివ " చిత్రం నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినీ జీవితానికే కాకుండా..తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగు సినీ రంగంలో ఆధునిక సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి   "శివ" కు ముందు, "శివ" కు తరువాత అని చెప్పుకోనేలా చరిత్రను మార్చేసింది. సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా తీయాలి, ఇలా ప్రచారం చేయాలి, ఇలా ప్రేక్షకుల ముందుకు తేవాలి అని కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయ విధానాలను సమూలంగా మార్చేసింది. 


ఎంతలా అంటే.."శివ" విడుదలై మూడున్నర దశాబ్దాలు అవుతున్నప్పటికీ ప్రస్తుత సినిమాలలో ఎక్కడో ఒకచోట ఆ ఛాయలు, ప్రభావం కనిపిస్తూనే ఉన్నంతగా..! కాలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు, కాలేజ్ సాంగ్స్, మాఫియా నేపథ్య కథలు, సన్నివేశాలు ఉంటే అది శివ తో పోల్చి చూడడం కామన్ అయిపొయింది. యాక్షన్, మ్యూజిక్, ఫైట్స్, టేకింగ్, పబ్లిసిటీ ఇలా  సినిమాకు సంబంధించిన అన్ని ప్రక్రియలలోనూ ఒక నూతన ఒరవడి సృష్టించింది. 


                Also read : చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం


చిత్ర పరిశ్రమలో ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్, కృష్ణ , శోభన్ బాబులు సుదీర్ఘ కాలం మొదటి తరం  అగ్ర కథానాయకులుగా, అభిమానుల ఆరాధ్య దైవాలుగా  విశేష ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. అదే విధంగా  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు రెండో తరం అగ్ర హీరోలుగా కొన్ని దశాబ్దాలు తెలుగు సినీ సీమలో తమ ప్రాభవాన్ని. ఘనంగా చాటారు..నేటికి సైతం  చాటుతున్నారు. ఈ రెండో తరం హవా 80 ల్లో మొదలైంది. 


70ల్లోనే సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ 1983 లో వచ్చిన "ఖైదీ" అఖండ విజయం చిరంజీవిని అగ్ర కథానాయకుడిని చేసింది. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ 1984 లో వచ్చిన " మంగమ్మ గారి మనవడు " బాలకృష్ణ ను నందమూరి వారసుడిగా, అగ్ర హీరోగా నిలబెట్టింది. ఇక మూవీ మొఘల్,  స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు తనయుడిగా వెంకటేష్ 1986 లో కె రాఘవేంద్రరావు దర్శకత్వం లో  "కలియుగ పాండవులు", అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సైతం 1986 లోనే వి మధుసూదనరావు దర్శకత్వం లో  "విక్రం" సినిమాల ద్వారా విజయంతో పరిశ్రమలో అడుగు పెట్టారు.  


నాగార్జున ఆ తరువాత  మజ్ను, కిరాయిదాదా, మురళీకృష్ణుడు, జానకిరాముడు, ఆఖరిపోరాటం, విక్కీదాదా, గీతాంజలి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ "శివ " చిత్రం తో మాత్రమే అసలైన స్టార్ డం వచ్చింది. తెలుగు సినీ లోకంలో అగ్ర కథానాయకుడు అనే స్థాయి, హోదా స్థిరపడింది. అప్పటికే అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణ ల తరువాత  రేంజ్  లో అభిమాన సమూహాన్ని తెచ్చి పెట్టింది. 22 సెంటర్స్ లో 100 రోజులు 5 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డ్ సృష్టించింది. 


Also read : భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984) 


తమిళ్ లో  ఉదయం గా డబ్బింగ్ చేయబడి అక్కడ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అంతకు ముందే మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన గీతాంజలి తమిళ్ లో కూడా సాధించిన విజయంతో గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునకు శివ తమిళ్ లో  కూడా మంచి మార్కెట్ ను, ఫ్యాన్ బేస్ ను తీసుకు వచ్చింది. శివ విజయం తరువాత నాగార్జున ప్రతి సినిమా తమిళ్ డబ్బింగ్ చేయడం పరిపాటి అయింది. 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే  "శివ" ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం జరిగింది నాగార్జునకు. అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. నాగార్జున, వర్మలు బాలీవుడ్ లో సైతం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నాంది పలికింది.


నాగార్జున తొలినాళ్ళ నుండి వినూత్న ప్రయోగాలకు ఆహ్వానం పలికేవారు. నూతన దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీ నటులకు తన సినిమాల ద్వారా అవకాశాలు కల్పించేవారు. అలా అవకాశం దక్కించుకొని టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ని సైతం  తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఉర్రూతలూగించిన వారే రాంగోపాల్ వర్మ. విజయవాడ సిద్ధార్థ లో ఇంజనీరింగ్ చేసిన వర్మ తండ్రి అన్నపూర్ణ స్టూడియో లో సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలు వెళదామనుకున్న వర్మ వీడియో పార్లర్ బిజినెస్ కి ఆకర్షితుడై అమీర్ పేట్ లో షాప్ ఆరంభించడం జరిగింది. ఆ సమయంలో విపరీతంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు చూడడం కారణంగా సినిమా ఫీల్డ్ వైపుకి ఆసక్తి మళ్ళింది.


అన్నపూర్ణ స్టూడియో తో ఉన్న అనుబంధం కారణంగా కలెక్టర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అప్రెంటిస్ షిప్ అవకాశం చిక్కింది. ఈ అనుభవం, అనుబంధంతో తన సిద్దార్థ కాలేజ్ రోజులు, కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రాసుకున్న శివ  కథను ఎంతో ఆత్మవిశ్వాసంతో  నాగార్జునకు వినిపించి, ఒకే అనిపించారు. నూతన దర్శకుడితో ఆ ప్రయోగం ఏదో తమ స్వంత అన్నపూర్ణ స్టూడియోలోనే చేద్దామని నిర్ణయించుకున్న అక్కినేని వెంకట్ "శివ" ఒక సేఫ్ ప్రాజెక్ట్ అయితే చాలు అనుకున్నారు. 


"శివ" థియేటర్స్ లో విడుదల కావడమే తరువాయి కలెక్షన్స్ తో హోరెత్తించడమే కాకుండా..ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటి వరకూ హీరో అంటే అదిరిపోయే ఇంట్రడక్షన్, దిక్కులు పిక్కటిల్లే పిచ్ తో పేజీల కొద్దీ డైలాగ్ లు, ఒళ్ళు హూనం అయ్యే డ్యాన్స్ లు, గాలిలో పల్టీలు కొట్టి చేసే ఫైట్ లు ఇలా కొన్ని ఆనవాయితీ అర్హతలు, అంచనాలు ఈ సినిమాలో గల్లంతయ్యాయి. విలన్ అంటే భారీ భయంకర ఆకారం, ముఖంలో నిరంతరం తాండవించే రౌద్రం అన్న నిర్దిష్ట నియమాలు కూడా కొట్టుకు పోయాయి. విలన్ రఘువరన్ కు  భవానీ అనే మహిళా సంబోధిత పేరు పెట్టడం కూడా ఒక ప్రయోగమే. 


                        Also read : నాటికీ, నేటికీ కృష్ణ  " సింహాసనం " సినిమా ఒక చరిత్ర 


హీరో, విలన్ పాత్రల చిత్రీకరణే కాదు శివ సినిమాలో ప్రతి అంశం సరికొత్త పంథాలో పయనించింది. ఒక కమర్షియల్ సినిమాలో సహజంగా చోటు చేసుకొనే హంగు, ఆర్భాటాలను తోసిరాజని వాస్తవికత కు దగ్గరగా చిత్రీకరించి కూడా పెద్ద సక్సెస్ ను సాధించవచ్చని నిరూపించింది. కాలేజ్ స్టూడెంట్స్, యువత మరీ ఎక్కువగా ఆదరించారు. నాగార్జున ఫుల్ హ్యాండ్స్ షర్ట్ స్లీవ్స్ పైకి మడత పెట్టిన డ్రెస్సింగ్ స్టైల్ టీనేజ్ ను వెర్రెత్తించింది. ఈ  స్టైల్ దశాబ్దాలు కొనసాగింది.  అదే విధంగా కాలేజ్ లో నాగార్జున సైకిల్ చైన్ లాగే ఫైట్ సన్నివేశం కూడా సినిమాకు ఒక హైలెట్.  


జెడి చక్రవర్తి, చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, రామ్ జగన్ వంటి వర్ధమాన నటులకు ఈ సినిమాతో  మంచి గుర్తింపు, నట జీవితం సొంతమైంది. శివ కు ఇళయరాజామ్యూజిక్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యమైన సన్నివేశాలు, ఫైట్స్ లో బ్యాక్ గ్రౌండ్  స్కోర్ అత్యున్నత స్థాయిలో నిలిపింది. "బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది" కాలేజ్ సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. "సరసాలు చాలు శ్రీవారు".."ఎన్నియల్లో ఎన్నియల్లో"..ఆనందో బ్రహ్మ" పాటలు కూడా సూపర్ హిట్ అయి అలరించాయి. 


మొత్తంగా  "శివ" నాగర్జున, రామ్ గోపాల్ వర్మ నట జీవితాలకే కాకుండా యావత్ భారత దేశ సినీ చరిత్రలోనే ఒక మాస్టర్ పీస్ గా నిలిచింది. అందుకే CNN - IBN ప్రకటించిన ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే ఫిల్మ్ ఫేర్ (19 90 ) ఉత్తమ తెలుగు చిత్రం గాను, నంది అవార్డ్స్ (19 90 ) ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ మాటల రచయిత ( తనికెళ్ళ భరణి ) మూడు సాధించింది. నాగార్జున, వర్మల "శివ" తాండవాన్ని ఆనాడు థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు ఎంతైనా అదృష్టవంతులు. 

                                       

                                            

14, డిసెంబర్ 2024, శనివారం

కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"


కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"



 తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం  మల్టీ స్టారర్ కాంబినేషన్  మూవీస్ 

కృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్ లో ఎన్నోవిజయవంతమైన  సినిమాలు వచ్చినప్పటికీ 19 85 లో సంయుక్త మూవీస్ బ్యానర్ పై విడుదలైన " మహాసంగ్రామం" వీరిరువురి కాంబినేషన్ లో చివరి సినిమాగా మిగిలిపోయింది. నాటి అగ్ర కథానాయకులు NT రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తరువాత ప్రభావవంతమైన స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది కృష్ణ, శోభన్ బాబులే. ఎన్టీఆర్ తరహాలో రివల్యుషన్, థ్రిల్లర్, యాక్షన్ ప్రధాన చిత్రాలతో మాస్  హీరోగా గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ కాగా, ఎ ఎన్నార్ లాగా రొమాన్స్, ఎమోషన్స్, ప్యామిలీ డ్రామా చిత్రాలతో క్లాస్ హీరోగా ఆదరణ పొందారు. సినిమాలు ఎంత  కలెక్షన్స్, ఎన్ని రోజులు, ఎన్ని కేంద్రాలు, ఎన్ని థియేటర్స్ లలో రికార్డ్స్ సృష్టించాయి అన్న విషయంలో ముందుగా ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ అభిమానుల మధ్య పోటీ ఉండేది. 


ఆ తరువాత ఆ పోటీ వాతావరణం కృష్ణ - శోభన్ బాబు అభిమానులకు కూడా అలవడింది. అప్పట్లో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్ టి ఆర్, ఎ ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లు ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు. ఎన్ఎ టి ఆర్ తోనూ, ఎ ఎన్ ఆర్ తోనూ శోభన్ బాబు  చాలా సినిమాలు చేసారు. అలాగే ఎన్ టి ఆర్ తో , ఎ ఎన్ ఆర్ తో  కృష్ణ కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ ల కంటే శోభన్ బాబు - కృష్ణలు చాలా జూనియర్స్ కాబట్టి వారు కలిసి నటించిన సినిమాలలో సహజంగా ఎన్ టి ఆర్ , ఎ ఎన్ ఆర్ పాత్రలకే ప్రాధాన్యత ఉండేది. 


ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ మూవీస్ 

ఎన్  టి ఆర్ - ఎ ఎన్ ఆర్ లు తమ తొలినాళ్ళలో  పల్లెటూరి పిల్ల (1950) నుండి... సత్యం శివం ( 19 81) వరకు మూడు దశాబ్దాలలో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేసారు. వీటిలో మిస్సమ్మ, తెనాలిరామకృష్ణ, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. సీనియర్ హీరో అయినప్పటికీ ఎ ఎన్ ఆర్ పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ తదితర చిత్రాలలో ఎన్ టి ఆర్ కంటే ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే కృష్ణ కంటే సీనియర్ అయిన శోభన్ బాబు తొలిరోజుల్లో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో తక్కువ నిడివి, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించారు. 


అప్పట్లో వాళ్ళు సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు తగిన న్యాయం చేసామా..లేదా..అన్న కోణం లోనే చూసే వారు తప్ప,  పాత్ర ప్రాధాన్యత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే తమకంటూ ఒక స్టార్ డం, తమకంటూ అభిమాన అనుచరగణం ఏర్పడిందో..అప్పటి నుండి మల్టీ స్టారర్ చిత్రం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి వచ్చేది. సినిమాలో తమ హీరోకి ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా తమ ఉత్తరాల ద్వారా, అభిమాన సంఘాల నాయకుల ద్వారా తమ అసంతృప్తిని, ఆవేదనను ఆ హీరోకి తెలియజేసేవారు. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ క్రేజ్ 

అప్పట్లో ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఆ తరువాత కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ మూవీస్ కి అంత క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ సినిమాలకు కూడా తొలి రోజుల్లో అంత పట్టింపు ఉండేది కాదు గానీ..తరువాత తరువాత హీరోలుగా ఒక స్థాయి, తమకంటూ భారీ అభిమాన ప్రేక్షక బలం ఏర్పడిన తదుపరి సినిమాలో పాత్రల ప్రాధాన్యత తోపాటుగా, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఆఖరికి ధరించే దుస్తులు కూడా తూకం వేసుకోవాల్సి వచ్చేది. మా హీరోకి ఒక పాట ఎక్కువ అంటే, మా హీరోకి ఒక ఫైట్ ఎక్కువ అని, మా హీరోనే ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అంటే..మా హీరోదే ఫస్ట్ సాంగ్ అని ఇలా ప్రతి విషయంలో ఎక్కువ తక్కువ వాగ్వివాదాలు జరిగేవి. ఒకప్రక్క మల్టీ స్టారర్ మూవీస్ అంటే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరనుండే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండేవారు. ఎక్కడ ఏ కొంచెం తేడా జరిగినా అభిమానులు దుమ్మెత్తిపోస్తారని అటు హీరోలు, ఇటు దర్శక, నిర్మాతలు తెగ కంగారు పడుతుండేవారు. ఈ మల్టీ స్టారర్ మూవీస్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా భారీ ఓపెనింగ్స్, తొలి వారం రికార్డ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేవి. 


ఆ ధైర్యంతో నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాల నిర్మాణానికి చాలా ఆసక్తి ప్రదర్శించేవారు. మొదట్లో కృష్ణ - శోభన్ బాబు కాంబినేషన్ సినిమాలలో కూడా తమ పాత్రల ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకొనలేదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్ ల తరువాత అగ్ర హీరోలుగా కృష్ణ , శోభన్ బాబులు తమ వ్యక్తిగత ఇమేజ్ లు సాధించడంతోనే ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్యను తరుచుగా అభిమానులు తెచ్చిపెట్టే వారు. ఎన్ టి ఆర్ తరువాత అంతటి మాస్ చరిష్మా ఉన్న హీరోగా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, రొమాన్స్, డ్రామా చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ క్లాస్ హీరోగా శోభన్ బాబు పేరు గడించారు. ఆయన అభిమానుల్లో మహిళా అభిమానులు ఎక్కువ. 


      Also read :   చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం


మహా సంగ్రామం తో ముగింపు 

మాస్ హీరో కావడంతో కృష్ణ కు సినిమాలలో  కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే వారు. అది మహాసంగ్రామం ( 1985) కు వచ్చేప్పటికి మరింత పెరిగింది. పేరుకి ఇద్దరు హీరోలు అయినప్పటికీ కృష్ణ హీరోయిజాన్ని అమాంతం పెంచేసి, శోభన్ బాబు పాత్ర ను సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి కుదించేయడం శోభన్ అభిమానులను వేదనకు గురి చేసింది. ఆ సినిమా పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ లో కూడా శోభన్ బాబు కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అప్పట్లో అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. అభిమానుల నిరసన సెగలు శోభన్ బాబు కు గట్టిగానే తగిలాయి. తన అభిమానులకు మానసిక వేదన కలిగినందుకు ఎంతో బాధగా ఉన్నదని, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించనని శోభన్ బాబు బహిరంగ ప్రకటన చేసే వరకు ఇది దారి తీసింది. మహాసంగ్రామం సినిమా  కృష్ణ - శోభన్ బాబు నటనా జోడీకి  ముగింపు పలికింది. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ 

లక్ష్మి నివాసం (1966), శ్రీ శ్రీ మర్యాద రామన్న (గెస్ట్ అప్పియరెన్స్ ) (1967), మంచిమిత్రులు (1969), విచిత్ర కుటుంబం (1969), మా మంచి అక్కయ్య (1970), పుట్టినిల్లు మెట్టినిల్లు (1973), గంగ మంగ (1973), కురుక్షేత్రం (1977), మండే గుండెలు (1979), కృష్ణార్జునులు (1982), ముందడుగు (1983), ఇద్దరు దొంగలు (1984), మహాసంగ్రామం (1985) 


10, డిసెంబర్ 2024, మంగళవారం

కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు..వెర్రెక్కి ఉన్నోళ్ళు..(అందమైన అనుభవం 1979 ) : Kurralloy Kurrallu song lyrics - ANDAMAINA ANUBHAVAM - Telugu Movie Top Songs

 చిత్రం : అందమైన అనుభవం (1979)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


                                     



పల్లవి :

 

కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు - ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా రీ..హో ..

 

 కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

                                              కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు   

 

                                                                    చరణం :

 

 గతమును పూడ్చేది వీళ్ళు - చరితను మార్చేది వీళ్ళు

కథలై నిలిచేది వీళ్ళు -  కళలకు పందిళ్ళు వీళ్లు

వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు...

చెలిమికెపుడూ జతగాళ్ళు – చెడుకు ఎపుడు పగవాళ్ళు

వీళ్ళ వయసు నూరేళ్ళు - నూరేళ్ళకు కుర్రాళ్లు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు -  ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా  రీ.. హో ..

 

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు -  కవ్వించే సోగ్గాళ్ళు

 

చరణం :

 

 తళతళ మెరిసేటి కళ్ళు - నిగనిగలాడేటి ఒళ్ళు

విసిరే చిరునవ్వు జల్లు - ఎదలో నాటేను ముల్లు

తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు

నిదురరాని పొదరిల్లు - బ్రహ్మచారి పడకిల్లు

మూసివున్న వాకిళ్ళు – తెరచినప్పుడే తిరునాళ్ళు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా  రీ.. హో ..

 

చరణం :

 

 నీతులుచెప్పే ముసలాళ్ళు – నిన్నా  మొన్నటి కుర్రాళ్లు

దులిపెయ్ ఆనాటి బూజులు -  మనవే ముందున్న రోజులు

తెంచేసేయ్ పాతసంకెళ్ళు

 

మనుషులె మన నేస్తాలు -  కమాన్ క్లాప్.. మనసులె మన కోవెల్లు

మనుషులె మన నేస్తాలు - మనసులె మన కోవెల్లు..యెవ్రీబడీ

మనకు మనమే  దేవుళ్ళు -  మార్చిరాయి శాస్త్రాలు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు - ఆవేశం ఉన్నవాళ్ళు రా రారా రీ.. హో ..

 

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు ..

కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్.. 


6, డిసెంబర్ 2024, శుక్రవారం

భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984) : Bhargav Arts bonding with Nandamuri Balakrishna (NBK)

 

భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984)  : Bhargav Arts bonding with Nandamuri Balakrishna (NBK)




విడుదల : 7 సెప్టెంబర్ 1984

నటవర్గం : బాలకృష్ణ, భానుమతి రామకృష్ణ , సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, గోకిన, వై విజయ, బాలాజీ..

దర్శకత్వం : కోడి రామకృష్ణ 

నిర్మాత : ఎస్ గోపాల్ రెడ్డి 

సంగీతం : కె వి మహదేవన్ 

నిర్మాణ సంస్థ : భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 


                                      1974 లో తండ్రి ఎన్ టి రామారావు దర్శకత్వంలో తెరకెక్కించిన  "తాతమ్మ  కల" చిత్రం ద్వారా బాల నటుడిగా  సినీ రంగ ప్రవేశం చేసారు నందమూరి బాలకృష్ణ. ఆ తరువాత తండ్రి ఎన్ టి ఆర్ తో కలసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమ కవి, దానవీర శుర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలలో నటించారు. ఎన్ టి ఆర్ రాజకీయ రంగ ప్రవేశ అనంతరం 1984 లో  భారతీ వాసు దర్శకత్వం లో  మొదటిసారిగా  సోలో హీరోగా " సాహసమే జీవితం" చిత్రంతో బాలకృష్ణ రీ ఎంట్రీ ఇచ్చారు. దీనితోపాటు తరువాత వచ్చిన తాతినేని ప్రసాద్ దర్శకత్వంలోని "డిస్కో కింగ్ " ( హిందీ డిస్కో డాన్సర్ కు రీమేక్ ) , కె విశ్వనాథ్ దర్శకత్వంలోని " జననీ జన్మభూమి" చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేక పోవడంతో నందమూరి అభిమానులు కొంచెం  నిరాశ చెందారు. 


                                   ఆ సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా.. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, సుహాసిని జంటగా సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన "మంగమ్మ గారి మనవడు" సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డ్ లను నెలకొల్పింది. 25 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని బాలకృష్ణ కు తొలి సోలో హీరో శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. శ్లాబ్ సిస్టం వచ్చిన తరువాత హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శించబడిన సినిమాగా చరిత్ర లిఖించింది. ఎన్ టి ఆర్ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా ఉన్న వారసుడిగా బాలకృష్ణ నిరూపించుకోవడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా స్థానాన్ని పదిలం చేసింది. 


                                 "బాలకృష్ణ - భార్గవ్ ఆర్ట్స్" మధ్య ఒక ఆత్మీయ బంధానికి పునాది వేసింది ఈ "మంగమ్మ గారి మనవడు" చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకు స్వంత చిత్ర నిర్మాణ సంస్థలు ఉండడం సహజం. ఎన్ టి ఆర్, బాలకృష్ణ లకు రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎ ఎన్ ఆర్, నాగార్జునలకు అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణకు పద్మాలయా స్టూడియోస్, కృష్ణంరాజు కు గోపీ కృష్ణా మూవీస్,  చిరంజీవి కి గీతా ఆర్ట్స్, వెంకటేష్ కు సురేష్ ప్రొడక్షన్స్ స్వంత నిర్మాణ సంస్థలుగా ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆయా స్వంత సంస్థల కంటే కొన్ని బయటి సంస్థల్లోనే కొందరు హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం, ఎక్కువ హిట్ లు దక్కించుకోవడం, ఎక్కువ అనుబంధం కలిగి ఉండడం జరుగుతుంది. 


                                    భార్గవ్ ఆర్ట్స్ కు బాలకృష్ణ కు అదే తరహా అనుబంధం ఉంటుంది. బాలకృష్ణ తో మంగమ్మ గారి మనవడు (1984), ముద్దుల కృష్ణయ్య  (1986), మువ్వగోపాలుడు (1987), ముద్దుల మావయ్య (1989), ముద్దుల మేనల్లుడు ( 1990 ), మాతో పెట్టుకోకు (1995) చిత్రాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. ఇందులో మువ్వ గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య లు శతదినోత్సవ చిత్రాలు కాగా, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్యలు ఇండస్ట్రీ హిట్ లు. ముద్దులమేనల్లుడు, మాతో పెట్టుకోకు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. భార్గవ్ ఆర్ట్స్ లో మరే హీరో ఇన్ని చిత్రాలు చెయ్యలేదు. ఒక్క నాగార్జునతో "మురళీకృష్ణుడు" (1988) తప్పించి మరే అగ్ర హీరోతోనూ సినిమాలు చేయలేదు. సుమన్, భానుచందర్, అర్జున్, రాజశేఖర్, సురేష్, వడ్డే నవీన్ లతో చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. 


                                   గ్రామీణ కథానాయకుడు పాత్రలో బాలకృష్ణ కు ఇంకెవరూ సాటి రారు అన్న ప్రశంసలను భార్గవ్ ఆర్ట్స్ అందించింది. మంగమ్మ గారి మనవడు నుండి ముద్దుల మేనల్లుడు వరకు ఐదు చిత్రాలలో ఒక విశేషం ఉంది. ఒక గొప్ప  కాంబినేషన్ కొనసాగుతూ వచ్చింది. ప్రొడక్షన్ - భార్గవ్ ఆర్ట్స్, హీరో - బాలకృష్ణ, దర్శకుడు - కోడి రామకృష్ణ, సంగీతం - కె వి మహదేవన్, నిర్మాత - ఎస్ గోపాల్ రెడ్డి. ఈ సినిమాల పేర్లు అన్నీ "మ" అక్షరంతో మొదలవుతాయి. ఏవో రెండు, మూడు సినిమాలు తప్ప భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ "మ" అక్షరం, దర్శకుడు కోడి రామకృష్ణ  సెంటిమెంట్ నే పాటించాయి. బాలకృష్ణ తో చివరి చిత్రం "మాతో పెట్టుకోకు" కు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, సంగీతం మాధవపెద్ది సురేష్. 


                                  "మంగమ్మగారి మనవడు" మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. దీనిలోని "దంచవే మేనత్త కూతురా " సాంగ్ ఇప్పటకీ రీమిక్స్, డిజే స్టైల్స్ తో ఉర్రూతలూగిస్తునే ఉంది. "వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త "... "గుమ్మచూపు నిమ్మ ముల్లు" పాటలు ఎంతగానో అలరించాయి. చాన్నాళ్ళ తరువాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి మంగమ్మ పాత్రకు ప్రాణం పోయడంతోపాటు "శ్రీ సూర్య నారాయణ మేలుకో" పాటను ఆలపించారు. ఈ చిత్ర ఘన విజయంతో ఆమె మరెన్నో సినిమాలలో తన నటన కొనసాగించారు. "చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు" పాటలో రాముడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలను పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా  అభిమానులను మెప్పించడమే కాకుండా భవిష్యత్ లో అటువంటి పాత్రలకు తానే సరిసాటి అని బాలకృష్ణ నిరూపించారు. మొత్తంగా మంగమ్మ గారి మనవడు "భార్గవ్ ఆర్ట్స్ - బాలకృష్ణ" లకే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకే ఒక గొప్ప విజయంగా నిలిచింది.